కాలనీల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : కాలనీల అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. అయితే హఫిజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా.. వారిని శాలవతో సన్మానించి, అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, ఏ చిన్న సమస్య ఐన కార్పొరేటర్ దృష్టికి గాని, తన దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధి చేసి ఒక ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ నర్సింగరావు, ట్రెజరర్ సాంబశివ రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీనివాసరావు, న్యాయ కార్యదర్శి శ్యాముల్, కాలనీవాసులుపాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తో  ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here