ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం.. కంటికి రెప్పలా కాపాడుకుంటాం: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ అందించి ఆదుకున్నది. ఆ ఇన్సూరెన్స్ చెక్కును కార్యకర్త కుటుంబానికి అందజేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కి చెందిన బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్త కే.వినయ్ కుమార్ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే వినయ్ కుమార్ బీఆర్ఎస్ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఉండటంతో వెంటనే స్పందించి ఆయనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు, పోస్టుమార్టం రిపోర్టులను బీఆర్ఎస్ ఇన్సూరెన్స్ విభాగానికి పంపడంతో రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ మంజూరైంది. ఆ (ప్రమాద బీమా పరిహార ) చెక్కును బాధిత కుటుంబానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి అందజేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలను ఆపదలో ఉన్నపుడు ఆదుకోని వారి కుటుంబాలకు కొండంత అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా ఆ కుటుంబాలకు కొండంత ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేష్, శివ పాల్గొన్నారు.

బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్త కే.వినయ్ కుమార్ కుటుంబానికి రూ. 2 లక్షల ప్రమాద బీమా పరిహార చెక్కును అందిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here