అభివృద్ధి పథంలో శేరిలింగంపల్లి

  • కమ్యూనిటీహాళ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్లతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంఖుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, జనప్రియ నగర్ ఫేస్- 1, జనప్రియ నగర్ ఫేస్- 5, కాలనీలలో రూ.1కోటి 24 లక్షల అంచనా వ్యయంతో ఎమ్మెల్యే సిడి పి, ఎస్ డిపి ప్రత్యేక నిధులతో కమ్యూనిటీ హాల్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్ లతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంఖుస్థాపన చేసి మాట్లాడారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు.

కాలనీల అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని , అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధమని ప్రజలకు తెలిపారు. అడిగిన వెంటనే కమ్యూనిటీ హాల్లకు నిధులు కేటాయించి సహకరించిన ఎమ్మెల్యే గాంధీకి ఈ సందర్బంగా కాలనీల సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

  • శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు

1. హుడా కాలనీలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం.

2. జనప్రియ నగర్ ఫేస్ 1లో రూ.25 లక్షల అంచనా వ్యయంతో కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణం.

3. జనప్రియ నగర్ ఫేస్ 5 కాలనీలో రూ.12 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here