హఫీజ్ పేట్ లో.. కనుల పండువగా సీతారాముల కల్యాణం

  • హఫిజ్ పెట్ 109  డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ లక్ష్మీ గౌతమ్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో వేడుకగా కళ్యాణోత్సవం
  • ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు
సీతారాముల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువస్తూ…

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి పరిధిలోని హఫిజ్ పెట్ 109 డివిజన్ లో సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా, కనుల పండువగా నిర్వహించారు. హఫిజ్ పెట్ 109  డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ లక్ష్మీ గౌతమ్ గౌడ్ దంపతులు నిర్వహించిన సీతారాముల కల్యాణంలో  ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ,  తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బండి రమేష్ కార్పొరేటర్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, హాఫిజ్ పెట్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ ఏసీపీ లక్ష్మణ రావు , సీఐ తిరుపతి రావు, వివిధ పార్టీ సీనియర్ నాయకులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రముఖ సంఘ సేవకులు, గ్రామపెద్దలు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

రాములవారి కల్యాణం జరిపిస్తూ..
సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here