ఘనంగా శ్రీ రామ నవమి.. ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా  నియోజకవర్గ ప్రజానీకానికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను కొండాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, చందానగర్, హఫీజ్ పేట్, మియాపూర్, ఆల్విన్ కాలనీ, ఎల్లమ్మబండ ,డివిజన్లలోని  దేవాలయాలలో రాములవారి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి.

నియోజకవర్గంలోని డివిజన్లలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here