త్వరలో రోడ్లు వేయిస్తాం : మారబోయిన రాజు యాదవ్, చింతకింది రవీందర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్ లో నెలకొన్న సమస్యలపై డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు డ్రైనేజీ, రోడ్లు, నీటి సమస్య ప్రధానంగా ఉందని వారి దృష్టికి తెచ్చారు. దీంతో ఆ నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం మెయిన్ రోడ్డు లో నడుస్తున్న డ్రైనేజీ, రోడ్డు వర్క్ లు పూర్తికాగానే.. ఇంటర్నల్ లైన్స్ లో కూడా మొదటగా డ్రైనేజ్, ఏవైనా తాగునిటీ లైన్ పెండింగ్ లో ఉంటే వేసి రోడ్లు వేయిస్తామని వారికి తెలిపారు. తదనంతరం మెయిన్ రోడ్డులో అభివృద్ధి పనులలో భాగంగా చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు పద్మారావు, నాయకులు కృష్ణ యాదవ్, దేవులపల్లి శ్రీనివాస్, ప్రభాకర్ గౌడ్, మల్లేష్ ముదిరాజ్, సురేష్, పవన్, ఫకృద్దీన్, మహేష్ ముదిరాజ్, కాలనీ వాసులు, లక్ష్మి, యాదయ్య, నవీన్ గౌడ్ ఉన్నారు.

గోపినగర్ లో పాదయాత్ర చేసిన మారబోయిన రాజు యాదవ్, చింతకింది రవీందర్ గౌడ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here