నియోజకవర్గాన్ని అన్నిరంగాలలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం

  • సీసీ రోడ్డు నిర్మాణ పనులను అర్థరాత్రి ఆకస్మికంగా పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీలో రూ. 30 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు. తెల్లవారుజామున వరకు అక్కడే ఉండి పనుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సాయి వైభవ్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం చాల సంతోషకరం విషయమని, సాయి వైభవ్ కాలనీ దశ దిశ ను మార్చామని, సాయి వైభవ్ కాలనీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. సీసీ రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులను అర్థరాత్రి ఆకస్మికంగా పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here