పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించం

  • కార్మికులను హెచ్చరించిన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీలో స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి పారిశుధ్య కార్మికులకు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి చెత్త సేకరణ బుట్టలను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి ఒక్కరు చెత్తను స్వచ్ఛ ఆటోలలో వేసే విధంగా చర్యలు చేపట్టాలని GHMC అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ Srp బాలాజీ, కాలనీ వాసులు శ్రీనివాస్ రెడ్డి, నాగి రెడ్డి, సుధాకర్, అమిత్ దూబే , పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

పారిశుధ్య కార్మికులకు చెత్త సేకరణ బుట్టలను అందజేస్తున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here