డ్రగ్స్ వాడకం పై రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అవగాహన

నమస్తే శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పబ్స్ లలో డ్రగ్స్ వాడకం పట్ల అవగాహన కల్పించారు. డ్రగ్ష్ వాడకం నిషేధమని, ఇది ఎక్కడ లభ్యమైనా అరికట్టాలని, డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు.

రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిషేధమని అవగాహన కల్పిస్తున్న దృశ్యం

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రవికాంత్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జీ దుర్గం శ్రీ హరి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు విగ్నేష్, శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కప్పెర దుర్గేష్, ప్రధాన కార్యదర్శి సాయి కిషోర్, నర్సింగ్, శివ పాల్గొన్నారు.

డ్రగ్స్ కు నో చెప్పుదాం అంటూ అవగాహన
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here