సత్య ఎన్ క్లేవ్ లో కార్పొరేటర్ నవతరెడ్డి డివిజన్ బాట

చందానగర్: చందానగర్ డివిజన్ లో ప్రతీ ఆదివారం నిర్వహిస్తున్న డివిజన్ బాట కార్యక్రమాన్ని కార్పొరేటర్ నవతరెడ్డి సత్య ఎన్ క్లేవ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ త్వరలోనే అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తాను డివిజన్ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నుండి స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. భవిష్యత్తులో సైతం ప్రజల సంక్షేమం కోసమే పాటుపడతానన్నారు. కరోనా విషయంలో కాలనీ వాసులు ఎవ్వరు భయబ్రాంతులకు గురికావద్దని తగుజాగ్రత్తలు తీసుకుంటే కరోనాని తరిమికొట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్,ప్రసాద్,లూయిస్,వెంకట్ రెడ్డి,గుప్త,జీవర్ధన్ రెడ్డి,రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here