ఆదినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలి: మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ఆది నాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ అన్నారు. మజీద్ బండలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వరుని కరుణాకటాక్షాలు ప్రజలపై తప్పక ఉంటుందన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని బిక్షపతి యాదవ్ ప్రారంభించారు. ఆయన వెంట బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, ప్రకాష్, స్థానిక నేతలు, బస్తి వాసులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

గణేశునికి పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here