ఘనంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు

  • కొనసాగుతున్న ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ లోని శిల్పా ఎన్ క్లేవ్ లో విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మూలవిరాట్టు శ్రీ లక్ష్మీ గణపతికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించారు.

శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి పంచామృత అభిషేకం

ఇందులో భాగంగా సోమవారం ఉదయం 7:30 నిమిషములకు స్వామి వారికి విశేష పంచామృతాభిషేకం, 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, మధ్యాహ్నం 12 గంటలకు : అన్నసమారాధన, సాయంత్రం 6 గంటలకు : అంకురారోపణ, ధ్వజారోహణ, వాస్తు పూజ, వాస్తు హోమం, యాగశాల ప్రవేశం చేపట్టారు. రాత్రి 7 గంటలకు రాఘవేంద్ర డాన్స్ మ్యూజిక్ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. 8.30 అల్పాహారం, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here