శిల్పారామంలో‌ ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ లోని శిల్పారామంలో నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్ ఫో కొనసాగుతుంది. ఈ ఎక్స్ ఫో లో ఎన్నో ఆకర్షణీయమైన చేనేత వస్త్రాలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా యంపీ థియేటర్ లో గౌతమీ శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.బ్రహ్మాంజలి, గణపతి కౌతం, మామవతు శ్రీ సరస్వతి, కామాక్షి స్తుతి, కొలువైతివారంగా సాయి, ఆనంద్ తాండవం, విన్నపాలు వినవలెయ్, శివాష్టకం, అష్ట లక్ష్మీ స్తోత్రం అంశాలను కుమారి వంశీ ప్రియా, ఐశ్వర్య, లహరి, శ్వేతా, పూజిత, వైష్ణవి, సిరి చందాన, సాంశ్రేష్ఠలు ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు.

శిల్పారామంలో కళాకారుల నృత్యప్రదర్శన
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here