రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నమస్తే శేరిలింగంపల్లి: అతివేగం, అజాగ్రత్తగా బైక్ నడుపుతూ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలై మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చేటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం‌ గొల్లముడిపాడు కు చెందిన టి.‌కోటేశ్వర రావు (70) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామం గోల్డెన్ తులిప్ ఎస్టేట్స్ లో ఫాట్ నం 2A ప్లాట్ నం 34 లో కుమారుడు ఫణికుమార్ వద్ద ఉంటున్నాడు. కోటేశ్వర రావు ఈ నెల 4 వ తేదీన సాయంత్రం షాపులో పాలు కొనుగోలు చేయడానికి రాఘవేంద్ర కాలనీకి నడస్తూ వెళ్లారు. మహాలక్ష్మీ మొబైల్ అండ్ సర్వీస్ వద్ద టీఎస్ 31 6884 నంబర్ గల ప్యాషన్ ప్రో బైక్ ను ఎస్.‌కాశీం అనే వ్యక్తి అజాగ్రత్తగా, నిర్లక్ష్యం గా నడిపి కాలినడకన వస్తున్న కోటేశ్వర రావు ‌ను ఢోకొట్టాడు. గమనించిన స్థానికులు ఫణికుమార్ కు‌ సమాచారం అందించగా‌ తల్లి హిమాదేవి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన కోటేశ్వర రావును ఆటోలో‌ ఎస్ ఐ ఏ లైఫ్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో‌ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని కుమారుడు‌ ఫణికుమార్ ఫిర్యాదు మేరకు బైక్ నడుపుతున్న ఎస్. కాశీం పై శుక్రవారం కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here