ఆకట్టుకున్న బెంగుళూరు కళాకారుల భరతనాట్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో బెంగుళూరుకు చెందిన కళాకారులు ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. డాక్టర్ దివ్యాసేన, సుప్రియ రవి కుమార్ శిష్య బృందం భరత నాట్య ప్రదర్శన ఇచ్చారు.‌ భరతనాట్య ప్రదర్శనలో  పుష్పాంజలి, కీర్తనం, ఆనంద అమృత వర్షిణి, కంజదళాయతాక్షి, ఆనంద నటన ప్రకాశం, మాధదేవ శివ శంభో అంశాలను కుమారి దివ్య, జాహ్నవి, ఉపనిష, అవంతి, స్నేహ, లు ప్రదర్శించి మెప్పించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన  ప్రముఖ నాట్య గురివు సుప్రియ రవికుమార్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో భాగంగా నర్తన గణపతిమ్, షడక్షర కౌతం, కీర్తనం, అర్ధనారీశ్వర శ్లోకం, తిల్లాన అంశాలను కుమారి జయకవి గౌతమ్, గాయత్రీ రవి కుమార్, వైశాలి, లోకవ్య, భావదారిని, ప్రతీక లు ప్రదర్శించి పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నారు.‌

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here