ఆకట్టుకున్న నృత్యార్చన కూచిపూడి ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో సందర్బంగా శిల్పారామం యంపీ థియేటర్ లో ప్రదర్శించిన నృత్యార్చన అందరిని ఆకట్టుకుంది. సంచలన స్కూల్ అఫ్ డాన్స్ గురువు డాక్టర్ కిరణ్మయి బోనాల శిష్య బృందం కళాకారుల నృత్యార్చన కూచిపూడి నృత్య ప్రదర్శన పలువురిని అలరింపజేసింది. వినాయక కౌతం, అన్నిమంత్రాలు, అసంయుత హస్తాలు, జతిస్వరం, తారంగం, అమ్మ అన్నంద దాయిని- పడవర్ణం, జనుత శబ్దం, ఒకపరి కొకపరి, సొగసుగా త్యాగరాజ కృతి, మంగళం అంశాలను సంచలన,సమ్మోహన, నయా, జయ, లాహిరి, తనుశ్రీ, యశస్వినీ, కున్దనశ్రీ, అనువింద, రితిక, దిశా, భార్గవి, వరుణ్య, తదితర కళాకారులు ప్రదర్శించారు. వీరికి నట్టువాంగం పై డాక్టర్ కిరమై బోనాల, గాత్రం సాయి దీపికా, మృదంగం పై శ్రీ శ్రీ ధరాచార్య, వయోలిన్ సాయి కోలంక, ఫ్లూట్ వెంకటేష్ సహకారం అందించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ పసుమర్తి శేషు బాబు, ప్రొఫెసర్ గౌరీ శంకర్, వైస్సార్ మూర్తి, పద్మ కళ్యాణ్ విచ్చేసి కళాకారులకు జ్ఞాపికలతో సత్కరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here