మళ్లీ గాంధీని గెలిపిద్దాం.. అభివృద్ధిని కొనసాగిద్దాం

నమస్తే శేరిలింగంపల్లి:  మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గెలుపు కోసం మయూరి నగర్ కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్  ఉప్పలపాటి శ్రీకాంత్  ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ర్యాలీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్  మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీని భారీ మెజారిటీతో గెలిపించాలని, మయూరినగర్ కాలనీవాసులతో కలసి ప్రజలకు శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో చేపట్టిన ఇంటింటిి ప్రచారానికి, ప్రజలనుంచి మంచి స్పందన ఉందని, మళ్లీ గాంధీకే తమ మద్దతు అంటూ ప్రజలు చెబుతున్నారన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లుగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నిరంతరం సేవచేసిన నాయకుడు, తమ కష్టసుఖాల్లో పాలుపంచుకుని అనునిత్యం మనకు అండగా నిలిచిన నేతని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు.

సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తున్న ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, కాలనీ అధ్యక్షులు నారాయణరావు, రామరాజు, కిషోర్, ప్రవీణ్ రెడ్డి, సోమేశ్వర్ రెడ్డి, హరి, ఫ్రాన్సిస్ రెడ్డి, ప్రేమ్, గోపాల్ రెడ్డి, సుబ్బా రాజు, జాంగీర్ , విష్ణు, రమేష్ బాబు, వెంకట్ రెడ్డి, ఈశ్వరరావు, వినోద్, కృష్ణ, రంగారావు,  బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here