నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ డివిజన్ నాయకులు కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులై ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా కొడంగల్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంతన్న సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
వీరిని రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి అన్ని విధాలుగా కృషి చేయాలని వారికి తెలిపారు.