ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం సీఎం సహాయ నిధి : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 కి చెందిన ఓం ప్రకాష్ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి రూ. 18 వేలు మంజూరయ్యాయి.

ఈ ఆర్థిక సహాయ చెక్కు ను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందచేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా నిలబడుతున్నదన్నారు. వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here