పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 70 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి రూ. 24 లక్షలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ చెక్కులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందజేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు గొప్ప వరమని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పోతుల రాజేందర్,బ్రిక్ శ్రీనివాస్, శ్రీనివాస్, జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్, అనిల్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ చౌదరి, జోగిపేట భాస్కర్, శ్రీధర్ రెడ్డి, రఘునాథ్, అంకారావు, అనిల్, శ్రీశైలం, నర్సింగ్, నర్సింహ, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here