సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రూ. 1కో టి 80 లక్షల వ్యయంతో శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్, గాంధీ, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శంకుస్థాపన చేశారు.

ఓల్డ్ లింగంపల్లి విలేజ్, గోపినగర్-నెహ్రు నగర్, సుదర్శన్ నగర్, ఇందిరా నగర్ కాలనీల్లో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి అనంతరం మాట్లాడారు. శేరిలింగంపల్లి డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, బీఆర్ఎస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్షుచిగా మారిందన్నారు.

కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, డివిజన్ లోగల సీనియర్ నాయకులు, బస్తి కమిటీ మెంబర్స్, బూత్ కమిటీ మెంబర్స్, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, మహిళా నాయకురాలు, ఆయా కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here