అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం

  • సందయ్య ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్
  • 25 వ రోజు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 500 మందికి కంటి అద్దాలను ట్రస్ట్ యాజమాన్యం భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ తాత సందయ్య చూపిన బాటలో, తండ్రి చూపిన సేవ మార్గంలో నడుస్తూ ప్రజాసేవ చేయడానికి అంకిత భావంతో ఉన్నానని, రేపు జరగబోయే సాధారణ ఎన్నికల్లో మీరంతా ఆశీర్వదిస్తే అసెంబ్లీలో నియోజకవర్గ ప్రజ సమస్యల పై గళ మెత్తి మాట్లాడి ప్రజా రంజక పరిపాలన కొనసాగిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాగుల్ గౌడ్, మహేష్ యాదవ్, శ్రీధర్ గౌడ్, లక్ష్మణ్ , రవి గౌడ్, కృష్ణ యాదవ్, శంకర్ యాదవ్, రవి ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, జితేందర్ కోటేశ్వరరావు, బాబు, నవీన్, సాయి, కృష్ణంరాజు, జగన్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్, సత్యనారాయణ, శివ, బాపురావు, సలీం, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here