బిజెపితోనే సమస్యలకు పరిష్కారం

  • అవకాశం ఇస్తే చేసి చూపిస్తామని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మొవ్వా సత్యనారాయణ హామీ
  • కొనసాగిన ప్రజా ఆశీర్వాద యాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ, సురభి రవీందర్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన భారతీయ జనతా పార్టీ ప్రజా ఆశీర్వాద యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. హఫీజ్ పేట్ 109వ డివిజన్ అంబేద్కర్ నగర్, జనప్రియ కాలనీ, సాయి రంగా థియేటర్ మీదుగా ప్రజా ఆశీర్వాద పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో భాగంగా వారు ఇంటింటికి తిరుగుతూ, ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మొవ్వ సత్యనారాయణ మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో బిఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం వచ్చి దొంగ హామీలు ఇచ్చి, కల్లబొల్లి మాటలు చెప్పి, ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత వారికీ స్థానిక సమస్యలు కనపడటం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిఆర్ఎస్ అరాచకాలను, కబ్జాలను ప్రజలకు తెలియజేసెలా, ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తెలిసే విధంగా కరపత్రాలు పంచుతూ పాదయాత్ర కొనసాగిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, వేల కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామని చెబుతున్న అధికార పార్టీ నాయకులకు ఇక్కడ నెలకొన్న సమస్యలు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బిజేపీకి అవకాశం కలిపించాలని, శేరిలింగంపల్లిలో కమలం వికసించిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటెస్టెడ్ కార్పొరేటర్ సురభి రవీందర్ రావు, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్, మహేష్ యాదవ్, రవి గౌడ్, జగన్ గౌడ్, నరేందర్ రెడ్డి, రెడ్డి ప్రసాద్, శోభ దూబే, వర ప్రసాద్, పవన్, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here