ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ బిక్షపతి ఎంక్లేవ్ దగ్గర సంక్రాంతి పండుగ సందర్భంగా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. కొమిరిశెట్టి ఫౌండేషన్, విజేత సూపర్ మార్కెట్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీల నిర్వహణ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దడం భారతీయ సనాతన సంప్రదాయం అన్నారు. ఈ పోటీలలో న్యాయనిర్ణేతలుగా విజయలక్ష్మి, టి. వరలక్ష్మి వ్యవహరించారు. స్థానిక మహిళా నాయకురాళ్ళు మెర్సీ, శోభ, శ్రీదేవి, త్రివేణి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మల్లేష్, జనార్ధన్ పాల్గొన్నారు.

చందానగర్ బిక్షపతి ఎంక్లేవ్ లో నిర్వహించిన పోటీల్లో ముగ్గులు వేసిన మహిళలు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here