వేడుకగా స్వర్ణోత్సవ సమ్మేళనం 

నమస్తే శేరిలింగంపల్లి : భేల్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ సమ్మేళనం ఘనంగా జరిగింది.

స్వర్ణోత్సవ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్  ను స న్మనిస్తున్న దృశ్యం

ఈ కార్యక్రమంలో ఆర్.సి పురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, జడ్జి నామాల అశోక్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ గుర్రపు రవీందర్ రావు, సీనియర్ నాయకులు రామ్ మోహన్ రెడ్డితో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం బిహెచ్ఇఎల్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. భేల్ తో వారికి ఉన్న అనుభూతులను పంచుకున్నారు. ఈ సమ్మేళనంలో వ్యవస్థాపక సభ్యులకు, పద్మశాలి ప్రముఖులకు, విశిష్ట నాయకులకు, సన్మానం, మహిళలకు చిన్నారులకు ఆట, పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

పాల్గొన్న యాదవ కుటుంబ సభ్యులు

ఈ కార్యక్రమంలో బిహెచ్ఇఎల్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుస రమేష్, జనరల్ సెక్రటరీ చెరుపల్లి వీణ నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మధుసూదన్, చీఫ్ పట్రోన్ చెరుపల్లి సోమదాస్, వైస్ ప్రెసిడెంట్ రవి కుమార్, కరుణాకర్, శ్రీహరి, గోపాల్ యాదవ్, సుధాకర్ రెడ్డి, సైదులు, ట్రెజరర్లు, జాయింట్ సెక్రటరీస్, ఆర్గనైజర్ సెక్రటరీస్, చీఫ్ అడ్వైజర్స్, అడ్వైజర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here