బతుకమ్మ చీరల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: బతుకమ్మ పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. చందానగర్ డివిజన్ పరిధిలోని మున్సిపల్ కళ్యాణ మండపం, ఇంద్ర నగర్, వేముకుంట, దీప్తి శ్రీ నగర్, వేమన కాలనీలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. అనంతరం మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ఆడపడుచులను తన కుటుంబంగా ఆదరించి బతుకమ్మ పండుగ కానుకగా సీఎం కెసిఆర్ ఒక వైపు చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూ స్థానికంగా బతుకమ్మ చీరలను తయారుచేసి తెలంగాణ ఆడపడుచులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ఆడపడుచు బతుకమ్మ చీరను ధరించి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆమె కోరారు.
ప్రతి బతుకమ్మ పండగకు చీరలు పంచడం సంతోషణీయమని ఆడపడుచుల తరుపున సీఎం కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందా నగర్ డివిజన్ బీఆర్ ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , వరలక్ష్మి, రాజేశ్వరి , ఝాన్సి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here