తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ లను కలిసిన మహిపాల్ యాదవ్, శ్రీహరిగౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకుడు మహిపాల్ యాదవ్, రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్ దుర్గం శ్రీహరి గౌడ్ లు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడితో కలిసి నూతనంగా ఎన్నికైన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పూల బొకే అందించి అభినందించి, సన్మానించారు.

ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు బొకే అందిస్తూ..

శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ మహిపాల్ యాదవ్ , రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్ టిపీవైసీ దుర్గం శ్రీహరి గౌడ్ లు తెలంగాణ సచివాలయంలో నూతనంగా ఎన్నికైన కేబినెట్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ సచివాలయంలో కేబినెట్ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బొకే అందిస్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here