ఎమ్మెల్యే గాంధీకి అభినందనల వెల్లువ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన శుభసందర్బంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పూలబొకేలు అందించి, శాలువాతో సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కాలనీల అసోసియేషన్ సభ్యులు.

ఎమ్మెల్యే గాంధీని కలిసి సత్కరించిన ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు అనిల్ రెడ్డి, హైదర్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు దామోదర్ రెడ్డి తదితరులు

ఇందులో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు అనిల్ రెడ్డి, హైదర్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, అస్లాం, మధు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కాలనీల అసోసియేషన్ సభ్యులు వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి హర్షం వ్యక్తం చేశారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ తన పై విశ్వాసం ఉంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here