అన్నమయ్యపురంలో కన్నులవిందుగా నృత్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు సారధ్యంలో తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనల ప్రచారంలో భాగంగా ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర శశి నికేతన్ శిష్యుల కూచిపూడి నృత్య ప్రదర్శన కన్నుల విందుగా జరిగింది. జె. దీపా నేతృత్వంలో గణపతి స్తుతి, మధ్య మారుత, ముద్దు గారే యశోద, పాహిరమా ప్రభో, ముకుందా… ముకుందా, జెంత జేంత జేమ్, జాతి స్వరం మొదలగు పాటలకు కిన్నేర, మనస్విని, భవిష్య, దుర్గా, సుప్రియ, వర్షా, గాయత్రి, శనయా, ప్రఖ్యా, రీత్యా శ్రీ, హర్షిత, దీక్ష గంట పాటు చేసిన కూచిపూడి నాట్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.కార్యక్రమానంతరం కళాకారులను డాక్టర్ శోభారాజు సత్కరించారు. చివరిగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతి, ప్రసాద వితరణ తో కార్యక్రమం ముగిసింది.

నృత్య ప్రదర్శనలో శ్రీ వెంకటేశ్వర శశి నికేతన్ శిష్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here