స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యం వద్దు: ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో మియాపూర్ డివిజన్ GHMC చెత్త ఆటో కార్మికులు, GHMC పారిశుధ్య సిబ్బందికి AMHO డాక్టర్ కార్తిక్ తో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని, అలాగే ప్రతి ఒక్కరు వివిధ కాలనీలలో కాలనీ వాసులతో మర్యాదపూర్వకంగా ఉండాలని, తడి పొడి చెత్తను వేరు చేసే విధంగా అవగాహన కల్పించాలని, కాలనీలను పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ GHMC అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ SRPలు కనకరాజు, మహేష్, SFAలు వినయ్, మహేష్, అగమయ్య, సునీల్, డివిజన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, చెత్త ఆటో కార్మికులు పాల్గొన్నారు.

మియాపూర్ డివిజన్ GHMC చెత్త ఆటో కార్మికులు, GHMC పారిశుధ్య సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న AMHO డాక్టర్ కార్తిక్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here