ప్రజా సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ : కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫూర్ నగర్ లోని హెచ్ పి పెట్రోల్ బంకు వద్ద రోడ్డు పై డ్రైనేజీ మురుగు నీరు నిలిచి పోవటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్పొరేటర్ హమీద్ పటేల్ దృష్టికి తెచ్చారు స్థానికులు. వెంటనే స్పందించి అక్కడికి చేరుకొని స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక కార్యాచరణ కింద విషయాన్ని పరిగణలోకి తీసుకొని తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని ప్రజలను కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలిపారు.

గఫూర్ నగర్ లోని హెచ్ పి పెట్రోల్ బంకు వద్ద రోడ్డు పై పారుతున్న మురుగు నీటిని పరిశీలిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here