ఎట్ట‌కేల‌కు తెరుచుకోనున్న క్రీడా ప్రాంగ‌ణాలు

 

పీజేఆర్ స్టేడియంలో ఏపుగా పెరిగిన గ‌డ్డిని తొల‌గిస్తున్న సిబ్బంది. ప‌రిశీలిస్తున్న చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ఉప‌క‌మిష‌న‌ర్ సుధాంశ్ నంద‌గిరి

-ఆరునెల‌ల త‌ర్వాత అడ‌విని త‌ల‌పిస్తున్న పీజేఆర్ స్టేడియం
-పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో డీసీ సుధాంశ్ నంద‌గిరి
-సిద్ధ‌మ‌వుతున్న మ‌యూరీన‌గ‌ర్ క్రికెట్ గ్రౌండ్స్, మాతృశ్రీన‌గ‌ర్, గౌత‌మి ఎన్‌క్లేవ్‌ టెన్నీస్ కోర్టులు‌

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): క్రీడా ప్రాంగ‌ణాలు ఎట్ట‌కేల‌కు తిరిగి తెరుచుకోనున్నాయి. క‌రోనా విజృంభ‌న‌ నేప‌థ్యంలో మార్చి 22న జ‌న‌తా కర్ఫ్యూ నాడు క్రీడాప్రాంగ‌ణాలు మూత‌ప‌డిన విష‌యం తెలిసిందే. కాగా లాక్‌డౌన్ ల ప‌ర్వం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు అవి తెరుచుకోలేవు. ఐతే ఆగ‌స్టు 5వ తేదీ నుంచి జిమ్‌, యోగా సెంట‌ర్లు న‌డుపుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికి క‌రోనా ఉదృతి కొన‌సాగుతున్న‌ నేప‌థ్యంలో సాముహికంగా వ్యాయామం, యోగా చేసేందుకు ఎవ‌రు సాహ‌సం చేయ‌లేక‌పోయారు. తాజాగా సెప్టెంబ‌ర్ 21 నుంచి క్రీడా ప్రాంగ‌ణాలు తెరుచుకునేలా ప్రభుత్వం నిర్ణ‌యించింది.

వాకింగ్ ట్రాక్‌లో పేరుకుపోయిన ఆకులు, చెత్త‌ను తొల‌గిస్తున్న సిబ్బంది

జీహెచ్ఎంసీ ప‌రిధిలోని అన్ని క్రీడా ప్రాంగ‌ణాలు తెరుచుకోవ‌చ్చ‌ని, కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ అన్ని క్రీడా విభాగాల్లో శిక్ష‌ణ మొద‌లు పెట్టుకోవ‌చ్చ‌ని, 100 మంది మించ‌కుండా స్పోర్ట్స్ ఈవెంట్స్ జ‌రుపుకోవ‌చ్చని సూచిస్తూ ఈ నెల 3న జీహెచ్ఎంసీ క్రీడా విభాగం స‌ర్కుల‌ర్ జారీ చేసింది. శేరిలింగంప‌ల్లిలో బ‌ల్దియా ఆద్వ‌ర్యంలో న‌డుప‌బ‌డుతున్న‌ పీజేఆర్ స్టేడియం, మియాపూర్ మ‌యూరీన‌గ‌ర్ క్రికెట్ గ్రౌండ్స్, మియాపూర్ మాతృశ్రీన‌గ‌ర్ క్రికెట్ గ్రౌండ్స్, కొండాపూర్ గౌత‌మి ఎన్‌క్లేవ్‌లోని టెన్నీస్ కోర్టులు తిరిగి తెరుచుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

మంగ‌ళ‌వారం నుంచి అన్ని క్రీడ‌ల‌కు రంగం సిద్ధం…

పార్కింగ్ ఏరియాను పూర్తిగా క‌మ్మేసిన చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గిస్తున్న‌సిబ్బంది

పీజేఆర్ స్టేడియంలో ఆరునెల‌లుగా జ‌న‌సంచారం లేక‌పోవ‌డంతో ఎక్క‌డిక‌క్క‌డ గ‌డ్డి, పిచ్చిమొక్క‌లు ఏపుగా పెరిగిపోయి అడ‌విలా మారిపోయింది. కాగా గ‌త కొన్ని రోజులుగా స్టేడియం సిబ్బంది వాటిని తొల‌గించే ప‌నిలో ప‌డ్డారు. చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ఉప‌క‌మిష‌న‌ర్ సుధాంశ్ నంద‌గిరి స్టేడియంలో కొన‌సాగుతున్నపున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. స్టేడియం తిరిగి మొద‌ల‌వుతున్న నేప‌థ్యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను సిబ్బందికి వివ‌రించారు.

యోగా ప్రాంగ‌ణం చుట్టు పెరిగిన మొక్క‌లు, ముందు వైపు శుభ్రం చేసిన దృశ్యం

అన్ని క్రీడా విభాగాల‌తో పాటు జిమ్‌, వాకింగ్‌, యోగా త‌ర‌గ‌తుల్లో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ శిక్ష‌ణ కొన‌సాగించేలా చూసుకోవాల‌ని సూచించారు. కాగా ప్రభుత్వ ఉత్త‌ర్వుల ప్ర‌కారం సోమ‌వారం నుంచి స్టేడియాలు తెరుచుకోవాల్సి ఉండ‌గా.. సోమ‌వారం క్రీడా ప్రాంగ‌ణాల‌కు సెల‌వు దినం కావ‌డంతో మంగ‌ళ‌వారం నుంచి పీజేఆర్ స్టేడియం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఐతే క్రీఢ‌ల‌కు సంబంధించిన వివ‌రాల కోసం బ‌ల్దియా వెబ్ సైట్ www.ghmc.gov.in/sports లో సంప్ర‌దించ‌వ‌చ్చు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here