మహిళలకు హోప్ ఫౌండేషన్ కుట్టు మిషన్ల పంపిణి

మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్

-హోప్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం:ప్రభుత్వ విప్ గాంధీ

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణి చేశారు. ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ చేతుల మీదుగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం హోప్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సేవలో పౌండేషన్ ముందువరుసలో నిలుస్తుందని అన్నారు. ఫౌండేషన్ నిర్వాహకులు కొండా విజయ్ కుమార్ ను ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here