చందాన‌గ‌ర్ లో యువ‌తి అదృశ్యం

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన ఓ యువ‌తి అదృశ్య‌మైన సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. చందాన‌గ‌ర్‌లోని ఇందిరాన‌గ‌ర్ కాల‌నీలో ప‌ల్ల‌పు అశోక్ అనే వ్య‌క్తి నివాసం ఉంటున్నాడు. ఇత‌ను స్థానిక భెల్ ప‌రిశ్ర‌మ‌లో కాంట్రాక్ట్ లేబ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.

దేవి (ఫైల్‌)

కాగా అశోక్‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె దేవి (20)కి ఇటీవ‌లే వివాహం నిశ్చ‌య‌మైంది. ఈ క్ర‌మంలో ఆమె ఈ నెల 19వ తేదీన ఉద‌యం 4 గంట‌ల‌కు ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. అనంత‌రం తిరిగి రాలేదు. దీంతో ఆమె కోసం కుటుంబ స‌భ్యులు అన్ని చోట్లా గాలించారు. అయిన‌ప్పటికీ ఆమె ఆచూకీ తెలియ‌లేదు. ఈ క్ర‌మంలో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here