శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ హుడా కాలనీ వద్ద బీజేపీ సీనియర్ నాయకుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులతో కలసి బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ పాల్గొన్నారు.






