నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ న్యూ గుడ్ షెఫర్డ్ ఫౌండేషన్ లో టీమ్ జీఆర్ఆర్ ఆధ్వర్యంలో చేవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా టీమ్ జీఆర్ఆర్ ప్రెసిడెంట్ ఎండీ జహీరుద్దిన్ చెవిటి, ముగ పిల్లలకు అన్నదాన కార్యక్రమం, పిల్లలకు బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ కటకం నేత, జనరల్ సెక్రటరీ ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు హనీఫ్, ఆఫ్రోజ్, ఆఫ్తాబ్ పాల్గొన్నారు.