నేటి నుండి 2వ జాతీయ వాటర్ పోలో చాంపియన్ షిప్

  • వేదికైన గచ్చిబౌలి స్మిమ్మింగ్ పూల్
  • 26 వరకు పోటీలు
  • పాల్గొననున్న 16 టీంలు

నమస్తే శేరిలింగంపల్లి: 2 వ జాతీయ వాటర్ పోలో చాంపియన్ షిప్ పోటీలకు గచ్చిబౌలి స్టేడియం వేదిక కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదివారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో పోటీల వివరాలను వెల్లడించారు. తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆద్వర్యంలో నేటి నుంచి 26 తేదీ వరకు ఉదయం 10 గంటలకు చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నామని, 16 టీంలు పోటీల్లో పాల్గొనున్నాయని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

2 వ జాతీయ వాటర్ పోలో చాంపియన్ షిప్ పోటీల వివరాలు వెల్లడిస్తున్న అసోసియేషన్ సభ్యులు

పోటీల్లో నేవి జట్టు, అర్మీ జట్టు, ఏయిర్ ఫోర్స్ , బెంగళూర్ జట్టు, జైపూర్ తో పాటు దేశంలోన పలు రాష్ర్టల జట్లు పాల్గొననున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆద్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి , కార్యదర్శి ఉమేశ్, చీఫ్ ప్యాట్రన్ కొండ విజయ్ కుమార్, సమంత రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here