పార్కులను అభివృద్ధి చేస్తాం: కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ పి.జె.ఆర్ స్టేడియంలో వాల్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా సమావేశం నిర్వహించారు.

చందానగర్ పి.జె.ఆర్ స్టేడియంలో ప్రచారంలో ఓటు అభ్యర్టిస్తున్న జగదీశ్వర్ గౌడ్

ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ..  శేరిలింగంపల్లిలో ఎవరు ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకోలేరని.. ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణే నిదర్శనమని తెలిపారు.

వాల్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ర్యాలీగా వెళ్తున్న జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లిలో పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, ప్రణాళికలు రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నాయకులు చేరగా వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here