విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

  • తెలంగాణ బహుజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చంటి ముదిరాజ్

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి, అధిక కల్పించాలని రాష్ట్ర బహుజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చంటి ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గతంలోనే నిర్ణయం తీసుకున్నా కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగులో ఉన్నాయని, ప్రధానంగా సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కెజిబివులు, ఆశ్రమ పాఠశాలలు, కళాశాల వసతిగృహాలకు మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయనీ, ఎస్టీ డిపార్ట్మెంట్ కళాశాల వసతి గృహాలకు జూన్ నుండి ఎస్సీ డిపార్ట్మెంట్ లో సెప్టెంబర్ నుండి మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని తెలిపారు.

గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు ఇప్పటికీ ఇవ్వలేదని, 2018 నాటి ధరలకనుగుణంగా ఇంకా పాత మెనూ అమలు అవుతుందనీ తెలిపారు. ప్రభుత్వం ఎస్సీ, బి. సి. హాస్టల్స్ కు ఇస్తున్న కాస్మోటిక్ ఛార్జీలు విద్యార్థులకు రూ. 65, విద్యార్ధినీలకు 100 సరిపోవడం లేదన్నారు. ఎస్టీ హాస్టల్స్ కు ఇస్తున్న ఆయిల్, సబ్బుల పరిస్తితి కూడా అంతేనని, వీటిని పెంచి ఇవ్వాలని కోరారు. అద్దె భవనల్లో నడుస్తున్న గురుకులాలు, హాస్టల్స్, కెజిబివిలకు స్వంత భవనాలు నిర్మించాలన్నారు. రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుండి 7,200 కోట్లకు పైగా స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్స్ పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా విడుదల చేయాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలని, యూనివర్శీటీల మెస్ బకాయిలు కూడా ఉన్నాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వసతిగృహాలకు, గురుకులాలకు, రెజిబివిలకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని, రాష్ట్రంలో పెండింగ్ ఉన్న మెస్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలని, హస్టల్స్ మరమ్మతుల భాధ్యత గురుకులాల తరహాలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు ఇచ్చి అన్నింటీని మరమ్మతు చేయించాలని, ప్రస్తుతం ధరలకు అనుగుణంగా అమలు జరిపేలా నిధులు ఇచ్చి ప్రీ మెట్రిక్ విద్యార్థులకు నెలకు రూ. 2 వెలు, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు రూ. 4 వేలు, వృతి విద్యా, యూనివర్శీటీల విద్యార్థులకు నెలకు రూ.5 వేలు అందించాలని, పెండింగ్లో ఉన్న 7200 కోట్ల స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న అన్ని గురుకుల కెజీబీవీ లకు స్వంత హాస్టళ్లు నిర్మించాలని, తెలంగాణ అన్ని జిల్లాలలో ప్రభుత్వ యూనివర్సిటీ, లా కాలేజి, ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here