నమస్తే శేరిలింగంపల్లి: ఇంటి నుంచి బయటికి వెళ్ళిన బాలుడు అదృశ్యమైన సంఘటన శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. వివరాలు సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహించే కుమారస్వామి కి ఇద్దరు కుమారులు(రిథ్విక్(18) సాత్విక్(14)) శేరిలింగంపల్లి లోని వెంకట్ రెడ్డి కాలనీ లో సన్షైన్ హై స్కూల్ దగ్గర నివసిస్తున్నారు. అయితే సాత్విక్ నారాయణ హైస్కూల్, ELP లింగంపల్లి బ్రాంచ్లో 9వ తరగతి చదువుతున్నాడు.
అయితే 19వ తేదీన సాయంత్రం 5.50 నిమిషాలకు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో వాళ్ళ అమ్మ సమత, అన్న రిథ్విక్ ఇంట్లో ఉన్నారు. మళ్ళీ 7 గంటలకు సాత్విక్ అమీన్ చికెన్ షాప్ వెంకట్రెడ్డి కాలనీకి వెళ్లి 7.30 కు తిరిగి వచ్చాడు. తరువాత రాత్రి 9.35 గంటలకు ఎవరికీ సమాచారం ఇంటి నుండి బయటికి వెళ్ళాడు. తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సాత్విక్ కోసం చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు వైట్ కలర్ టీ షర్ట్, గ్రే కలర్ జీన్స్ ధరించాడని, ఎత్తు సుమారు 5.3 అడుగులు, తెలుగు భాష మాట్లాడగలడని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.