- రూ. 2 లక్షలు విలువ చేసే
కెటిఎమ్, గ్లామర్, రెండు ఆక్టీవా స్కూటీలు స్వాధీనం
నమస్తే శేరిలింగంపల్లి: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. చందా నాయక్ తాండ, కాకతీయ హీల్స్, కావూరి హీల్స్ లోని ఏరియాలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై మాదాపూర్ పోలీసు స్టేషన్ లో సంబంధిత బాధితులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాలుగు కేసుల దర్యాప్తులో భాగంగా మాదాపూర్ క్రైమ్ సిబ్బంది ముగ్గురు బైక్ దొంగలను 18న న్యూ బోరబండ రహదారి వద్ద పట్టుకున్నారు. ఒకరు మహమ్మద్ మొయిన్ , మరో ఇద్దరు సిసిఎల్ ఉన్నారు. వారి నుండి రూ. 2 లక్షలు విలువ చేసే కెటిఎమ్, గ్లామర్, రెండు ఆక్టీవా స్కూటీ లను స్వాధీనం చేసుకున్నారు.