పొతుకూచి శ్రీనివాస్ కు అభినందనలు, సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి : పొతుకూచి సోమ సుందర సామాజిక సేవ సంస్ధకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ సేవ సంస్థగా గుర్తింపు లభించింది. గవర్నర్ చేతుల మీదుగా “ఉగాది పురస్కారం ” ఆ సంస్థ చైర్మన్ పొతుకూచి శ్రీనివాస్ అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించకుని పొతుకూచి శ్రీనివాస్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సన్మానించి అభినందనలు తెలిపారు.


పొతుకూచి సోమ సుందర సామాజిక సేవ సంస్ధకు ఉత్తమ సేవ సంస్థగా గుర్తింపు లభించిన సందర్భంగా పొతుకూచి శ్రీనివాస్ ను అభినందిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఆ సంస్థ 11 కేంద్రాలు 700 మంది పిల్లలతో చక్కగా నడుస్తున్నది. సుమారు 1000 మందికి పైగా ప్రభుత్వ పాఠశాల పిల్లలు డిప్లమా ఇంజీనీర్లు, 200 మందికి పైగా గ్రాడ్యూయెట్లు ఇంజీనీర్లు అయ్యారు. 200 మంది వరకు యం యల్ టీ, నర్సులుగా తయారు చేసినందుకు ఆయనకు విప్ గాంధీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఉక్కలం శ్రీధర్, భేతాళ భరత్, బ్రహ్మ రవుతు రవి కిరణ్, సాయిరాం పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here