క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రాధాన్యత కల్పిస్తుందని, ప్రతిఒక్కరు జీవితంలో విద్యతో పాటు క్రీడల్లో రాణించి మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆకాంక్షించారు. పీజేఆర్ స్టేడియంలో జి.హెచ్.ఎం.సి కార్పొరేటర్స్ స్పోర్ట్స్ మీట్‭ను జోనల్ కమీషనర్ శంకరయ్య తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, జోనల్ కమీషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్లు సూదంషు, వెంకన్న,హెల్త్ ఆఫీసర్ కార్తిక్ పాల్గొన్నారు.

పీజేఆర్ స్టేడియంలో జి.హెచ్.ఎం.సి కార్పొరేటర్స్ స్పోర్ట్స్ టోర్నమెంట్స్ లో పోటీలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
పీజేఆర్ స్టేడియంలో జోనల్ కమిషనర్ శంకరయ్య, కార్పొరేటర్లతో టోర్నమెంట్ గురించి చర్చిస్తున్న విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here