నమస్తే శేరిలింగంపల్లి : ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు కథనం ప్రకారం.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 30 నుంచి 35 సంవత్సరాల ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-26-at-8.22.06-PM.jpeg)
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ అతను మరణించాడు. వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే మియాపూర్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.