ప్రతి డివిజన్, కాలనీ, బస్తీలను సుందరంగా తీర్చిదిద్దుతాం: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోనీ ప్రతి బస్తి, కాలనీలలో మౌలికవసతుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు గాంధీ , మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ బస్తీలో, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, బస్తి సభ్యులతో కలిసి నూతనంగా మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చేపట్టిన డ్రైనేజీ పైప్ లైన్ పనులను పరిశీలించి మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్, కాలనీ, బస్తీలను ఆదర్శవంతమైన సుందరంగా తీర్చిదిద్దేలా, అందరి సమిష్టి కృషితో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, బస్తి కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here