కామ్రేడ్ తాండ్ర కుమార్ విగ్రహావిష్కరణ ప్రధమ వర్ధంతి సభను జయప్రదం చేయండి

  • కరపత్రం ఆవిష్కరించిన యంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు భాగ్యమ్మ
వర్ధంతి కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న యంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు భాగ్యమ్మ

నమస్తే శేరిలింగంపల్లి: అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ ప్రధమ వర్ధంతి సందర్భంగా ముజాఫర్ అహ్మద్ నగర్ లో 14న విగ్రహావిష్కరణ వర్ధంతి సభ నిర్వహిస్తున్నామని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని యంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి. భాగ్యమ్మ పిలుపునిచ్చారు. స్టాలిన్ నగర్ లో ఆమె కామ్రేడ్ తాండ్ర కుమార్ వర్ధంతి కార్యక్రమ కరపత్రాన్ని విడుదల చేస్తూ మాట్లాడారు. పేదల కోసం నిలువ నీడ ఏర్పాటు చేసి అనేక బస్తీలను ప్రజా పోరాటాల ద్వారా ఏర్పాటు చేశారని అన్నారు. చరిత్ర ఉన్నంతకాలం తాండ్ర కుమార్ఆ శయం బతికి ఉంటుందని ఆశయ సాధన కోసం ఎంసీపీఐ(యు) శ్రేణులు ముందుకు సాగుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు గణేష్ మియాపూర్ డివిజన్ కమిటీ సభ్యురాలు ఎం రాణి,జి లావణ్య, ధారా లక్ష్మి, స్టాలిన్ నగర్ సభ్యులు ఎన్ నాగభూషణం, ఏ.శంకర్, టి. నర్సింగ్, లక్ష్మి, కిషన్, నాగేష్, ఖాజా పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here