నమస్తే శేరిలింగంపల్లి: ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏ జే ఆర్ ఆర్చెడ్ కెపిఆర్ కాలనీ లో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం.. శాంతి కుమారి (16) ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నది. 9వ తేదీన వెలువడిన ఇంటర్ ఫలితాల్లో 3 సబ్జెక్టు లలో ఫెయిల్ అయినందుకు మానసికంగా క్రుంగి పోయి.. తాను ఉండే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన తల్లి దుర్గ ఇంటికి తిరిగి వచ్చే సమయంలో రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తెను గమనించి వెంటనే గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 10వ తేదీన సాయంత్రం 4గంటలకు తుదిశ్వాస విడిచింది.