- అధ్యక్షుడి గా జె బలరాం యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఏ బ్లాకు కాలనీ నూతన అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం బుధవారం నిర్వహించారు. శ్రీరామ్ నగర్ ఏ బ్లాకు కాలనీ అధ్యక్షుడి గా జె బలరాం యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా జె బలరాం యాదవ్ కు, అసోసియేషన్ సభ్యులకు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధికి తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని సూచించారు.
