శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా లక్ష కుంకుమార్చన

  • పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళ భక్తులు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న సప్రవింశ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం లక్ష కుంకుమార్చన వేడుకగా నిర్వహించగా.. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఉదయం 7.30 గంటలకు సంకల్పము, అష్టోత్తర శత కలశాభిషేకం, 10:30 గంటలకు సామూహిక లక్షకుంకుమార్చన, మధ్యాహ్నం 12 గంటలకు హారతి, తీర్థ ప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీవారికి చందనాభిషేకం చేస్తున్న పురోహితులు

సాయంత్రం 6:30 నుంచి 8 వరకు ఐశ్వర్య లక్ష్మీ హోమం, మహాదాశీర్వచనము సింహవాహన సేవ, రాత్రి 9 గంటలకు హారతి, తీర్థప్రసాద కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. హుడాకాలనీ వాసులు సి.బాలకృష్ణ నాయుడు, రాజ్యలక్ష్మి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. చందానగర్ వాసి యం.సంపత్ కుమార్ శ్రీవారికి పుష్పాలంకరణ చేయించారు. పి.సీతామహలక్ష్మి, పి.అరుణకుమారి, పి.ధర్మలు సింహవాహన సేవకు తోడ్పడ్డారు.

సామూహిక లక్ష కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here