శ్రీ సాయి గణేష్ దేవాలయ పున: నిర్మాణం పనులకు ఎమ్మెల్యే గాంధీ రూ. 1లక్ష విరాళం

నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధి ఆదిత్య నగర్ లోని శ్రీ సాయి గణేష్ దేవాలయ పున: నిర్మాణం పనులకు గాను తన వంతు సహాయంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ రూ. 1లక్ష విరాళం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శ్రీ సాయి గణేష్ దేవాలయ పున: నిర్మాణం పనులకు తన వంతు సహాయంగా లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగినదని, ఆలయ నిర్మాణంలో తనను భాగస్వామ్యం చేయడం చాలా సంతోషంగా ఉందని, అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆలయ నిర్మాణము పనులు త్వరితగతిన చేపట్టాలని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు.

శ్రీ సాయి గణేష్ దేవాలయ పున: నిర్మాణం పనులకు రూ. 1లక్ష విరాళం అందిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , దేవాలయం కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, భార్గవ్ గౌడ్, రాంచందర్ మూర్తి, ఏడుకొండలు, హరి భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here